విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఓరి దేవుడా. పి.వి.పి బ్యానర్పై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరో వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో నటించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేశారు. ఈ చిత్రవిజయాన్ని పురస్కరించుకుని, చిత్రబృందం విలేఖరులతో ముచ్చటించారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ‘‘నా తొలి సినిమా నుంచి సపోర్ట్ చేస్తోన్న అందరికీ థాంక్స్. ఓరి దేవుడా మూవీ మిమ్మల్ని టచ్ చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఫెస్టివల్ మూవీ. వెంకటేష్గారు మాతో పాటు ఉన్నారు. ఆయకు స్పెషల్ థాంక్స్. ఎంటర్టైనింగ్ మూవీ. ప్రేక్షకులే కాదు.. విమర్శకులకు కూడా సినిమా బాగా నచ్చింది. ఆడియెన్స్తో సినిమా చూసినప్పుడు క్రేజీ ఎక్స్పీరియెన్స్ అని చెప్పాలి. ఇంకా సినిమా రానున్న రోజుల్లో మరిన్ని వండర్స్ చేస్తుందని భావిస్తున్నాను. టీమ్ అందరం ఫ్యామిలీలా కలిసి ట్రావెల్ చేశాం. మళ్లీ అందరం కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం. లియోన్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. పివిపిగారికి థాంక్స్. సినిమాలోని పాటలను అందరూ ఎంజాయ్ చేస్తారు. వంశీ కాకగారికి థాంక్స్. నా బ్యాక్ బోన్లా నిలిచిన ఆదిత్యకి థాంక్స్. ప్రొడక్షన్ టీం, డైరెక్షన్ టీమ్కి థాంక్స్. అశ్వత్, నా హీరోయిన్స్, వెంకటేష్ కాకమాను సహా అందరూ వర్క్ చేసిన ఎక్స్పీరియెన్స్ మరచిపోలేను’’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక మాట్లాడుతూ, ‘‘అందరూ బాగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. విశ్వక్ని దిల్రాజు ఆఫీసులో చూసినప్పుడు తను భయపడుతూ కనిపించాడు. తన పేరు కూడా అప్పుడు తెలియదు. వన్ ఇయర్ తర్వాత ఫలక్నుమాదాస్ వచ్చింది. వెళ్లిపోమాకే సినిమా నుంచి ఇప్పటి వరకు నా రెమ్యునరేషన్ సేమ్. కానీ.. విశ్వక్ మాత్రం ఎవరూ గుర్తు పట్టని స్థాయి నుంచి పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు. చాలా సంతోషంగా ఉంది. ఎవడి లైఫ్కి వాడే హీరో. నా హీరో విశ్వక్ సేన్. తన గ్రోత్ సినిమా ప్రతీసారి నాకు అదే అనిపిస్తుంది. ఓరి దేవుడా ప్లెజెంట్ లవ్ స్టోరి. సినిమా చూసిన అందరూ ఎంజాయ్ చేస్తారు. పివిపిగారు ఈ సినిమా కోసం రెండేళ్ల పైగానే ట్రావెల్ అయ్యారు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ చాలా బావుందనే చెబుతున్నారు. మా కోసం రాజమండ్రి వచ్చి ఈవెంట్ను సక్సెస్ చేసిన రామ్ చరణ్గారికి ఈ సందర్భంగా స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను. అలాగే సినిమాలో స్పెషల్ రోల్స్ చేసిన వెంకటేష్గారికి థాంక్యూ వెరీ మచ్’’ అన్నారు.