సుధీర్ బాబు తన 18వ చిత్రంను అధికారికంగా ప్రకటించారు. సెహరి సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సినిమా చేయనున్నారు సుధీర్ బాబు. ఎస్ఎస్సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అనౌన్స్మెంట్ పోస్టర్లో సౌత్ బొంబాయికి చెందిన అరుణ్ గౌలి నుండి చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రమణ్యం వచ్చిన ఇన్ల్యాండ్ లెటర్ కార్డ్ కనిపిస్తుంది. ”క్రిటికల్: నీ రాక అవసరం” అనే మెసేజ్ కూడా కార్డ్ పై వుంది. తుపాకీ, బుల్లెట్లు, పాత ఐదువందల రూపాయి నోటు, ల్యాండ్లైన్ ఫోన్, సిగార్ తో పాటు పోస్టర్లో దేవాలయం, గ్రామ వాతావరణం కనిపిస్తుంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.