రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా మట్టి కుస్తీ. ఆర్ టి టీమ్వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.
ఈరోజు రవితేజ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్లో విష్ణు విశాల్ స్టార్ రెజ్లర్గా రింగ్లో బిగ్ ఫైట్ కి రెడీ అవుతున్నట్లుగా కనిపించారు. మట్టి కుస్తీ కథ గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది.
మట్టి కుస్తీ షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ లో సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.