ఉప్పెన వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ బుచ్చి బాబు సాన రామ్ చరణ్ ని డైరెక్ట్ చేయబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై రూపొందనున్న ఈ సినిమా ద్వారా వెంకట సతీష్ కిలారు నిర్మాతగా సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.