హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ, అమల అక్కినేని, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ విలేఖరుల సమావేశం నిర్వహించి చిత్ర విశేషాలని పంచుకుంది.
శ్రీకార్తిక్ మాట్లాడుతూ.. “ఇది నా మొదటి సినిమా. మొదట తమిళ్ లో రాశాను. ప్రభు గారు ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. తెలుగు లో కూడా చేద్దామని నాకు నమ్మకం ఇచ్చారు. తరుణ్ భాస్కర్ గారు డైలాగ్స్ రాశారు. నేను తెలుగు వాడ్నే. మా అమ్మ తెలుగు. ఈ సినిమా అమ్మ గురించిన సినిమా ఇది.. కాలంతో ప్రయాణం వుంటుంది. అందరూ కనెక్ట్ అవుతారు. శర్వానంద్ తన నటనతో మీ అందరికీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఇస్తాడు. అమల మేడమ్ గారితో పని చేయడం మర్చిపోలేను. అమల గారు ఈ చిత్రానికి ప్రధాన బలం. రీతూ వర్మ పాత్ర ఇందులో చాలా వైవిధ్యంగా వుంటుంది. ప్రభు గారు అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఈ సినిమా కూడా మరో వైవిధ్యమైన సినిమా అవుతుంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ పాత్రలతో పాటు మిగతా పాత్రలు ఇందులో కీలకంగా వుంటాయి. సిరివెన్నెల లాంటి లెజండరీ రచయిత మా సినిమాకి రాసిన అమ్మ పాట చిరకాలం నిలిచిపోతుంది. ఆయన ఆశీస్సులు మాపై వుంటాయి. సెప్టెంబర్ 9న ఈ సినిమా వస్తోంది. చాలా కొత్త కంటెంట్. మీ అందరికీ కొత్త అనుభూతిని ఇస్తుంది” అన్నారు.