శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగు అడుగుపెడుతోంది. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలౌతుంది ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ జరిగింది.
శర్వానంద్ మాట్లాడుతూ, “ఇంత అద్భుతమైన సినిమా తీసిన దర్శకుడు శ్రీకార్తిక్ కి కృతజ్ఞతలు. శ్రీకార్తిక్ పెద్ద దర్శకుడు అవుతాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఎస్ఆర్ ప్రభు సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. వారికి సహకారం మర్చిపోలేనిది. అమల గారు లేకుండా ఈ సినిమా ఊహించలేను. అమల గారితో కలసి నటించడం గౌరవంగా భావిస్తాను. సినిమాలో ఒక మ్యాజిక్ జరిగింది. సెప్టెంబర్ 9న ప్రేక్షకులు ఆ మ్యాజిక్ ని చూస్తారు. రీతూ వర్మ కథని నమ్మి ఈ సినిమా చేశారు. ప్రియదర్శి బ్రిలియంట్ గా ఫెర్ ఫార్మ్ చేశాడు. ఇందులో సరికొత్త వెన్నెల కిషోర్ ని చూస్తారు. ముగ్గురు పిల్లలు చాలా చక్కగా నటించారు. వారికీ హ్యాట్సప్ . జేక్స్ బిజోయ్ అద్భుమైన మ్యూజిక్ ఇచ్చారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూపిస్తున్నాం. ఇది నా ప్రామిస్. నేను మిమ్మల్ని నిరాశ పరచను. మేము అందరం నమ్మి ఒక మంచి సినిమా చేశాం. గర్వంగా చెబుతున్నా. సెప్టెంబర్ 9 అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి” అని కోరారు.