ప్రామిసింగ్ నటనతో ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో ఫస్ట్ టైమ్ ఆడియెన్స్ అటెన్షన్ తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి…జాతిరత్నాలు చిత్రంతో కోవిడ్ టైమ్ లోనూ ఇండస్ట్రీ హిట్ కొట్టి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా 70 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఆ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. జాతిరత్నాలు చిత్రంలో శ్రీకాంత్ పాత్రలో నవీన్ నటనకు ఆల్ ఏజెస్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రేక్షకుల ఆదరణే కాదు ఈ చిత్రంలో నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు నవీన్ పోలిశెట్టి.
తాజాగా సైమా అవార్డ్స్ నామినేషన్స్ లోనూ ఆయన క్రేజ్ కనిపించింది. వరుసగా రెండో సారి నవీన్ బెస్ట్ యాక్టర్ గా నామినేట్ అయ్యారు. గతంలో ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ చిత్రానికీ బెస్ట్ యాక్టర్ నామినేషన్ పొందారు. జాతిరత్నాలు సినిమా మొత్తంగా 8 నామినేషన్స్ తెచ్చుకుంది.
ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తనలాంటి ఔట్ సైడర్ హీరోకు ప్రేక్షకుల ఆదరణే అండగా నిలిచిందని ఈ సందర్భంగా నవీన్ ట్వీట్ చేశారు. *ప్రేక్షకుల ఆదరణ ఇచ్చే శక్తి ఇదే. జాతి రత్నాలు చిత్రానికి పనిచేసిన టీమ్ అంతా ఔట్ సైడర్స్, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్లం. మా చిత్రానికి సైమాలో 8 నామినేషన్స్ రావడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులు మాపై చూపే ప్రేమే అన్నింటికన్నా పెద్ద అవార్డ్ గా భావిస్తా. ఇండస్ట్రీలో స్థిరపడాలని కోరుకునే కామన్ మ్యాన్ కు మా విజయమే స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నా* అని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అనుష్క శెట్టి నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న నవీన్ అనుష్క సినిమాపై మంచి అంచనాలున్నాయి.