నవీన్ చంద్ర కథానాయకుడిగా, భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాణంలో దండు పాళ్యం ఫేమ్ శ్రీనివాస్ రాజు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ తగ్గేదేలే. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ, “ఈ చిత్రం ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ మధ్యలో జరిగింది. ఆ సమయంలో షూటింగ్లు కూడా జరగక అందరికీ ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ భద్ర ప్రొడక్షన్ మాత్రం ముందు అందరికీ పేమెంట్స్ ఇచ్చేశారు. వ్యాక్సినేషన్ చేయించారు. నిర్మాత పీపీ రెడ్డి గారికి థాంక్స్. ముందు లవ్ స్టోరీ అన్నారు. రొమాన్స్ చాలా ఎక్కువ ఉంది ఎలా అని అనుకున్నాను. కానీ ఇందులోకి సడెన్గా దండుపాళ్యం గ్యాంగ్ వచ్చింది. మూడు స్టోరీలను ఇందులో అద్భుతంగా సెట్ చేశారు. లవ్, యాక్షన్, వెంజెన్స్ ఇలా అన్నీ కూడా ఇమడ్చి పెట్టారు. ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది. అందరికీ సినిమా నచ్చుతుంది. మకరంద్ లాంటి నటులతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. అనన్య, దివ్యలు అద్భుతమైన నటులు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నవంబర్ 4న ఈ చిత్రం రాబోతోంది. పీపీ సార్.. మళ్లీ మాకు చాన్స్ ఇవ్వండి. ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్” అని అన్నారు.