నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా జరిగిన గోవా షెడ్యూల్తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేశారు.