నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల ది ఘోస్ట్ విడుదల తేది దగ్గరపడటంతో చిత్ర నిర్మాతలు ప్రమోషన్ల జోరు పెంచారు. థియేట్రికల్ ట్రైలర్తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్ని విడుదల చేశారు.
రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ, “నారాయణ్ దాస్ నారంగ్ గారికి నాతో సినిమా తీయాలని కోరిక. అలా ఈ సినిమా మొదలైయింది. ముందుగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ గారికి కృతజ్ఞతలు. ది ఘోస్ట్ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా గొప్ప నిర్మాణ విలువలతో తీశారు. ఈ సినిమాని ఒక కసితో తీశాం. ఇందులో సాంకేతిక విలువలు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. దర్శకుడు ప్రవీణ్ తో పాటు మిగతా సాంకేతిక నిపుణులు అంతా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ ని కూడా ప్రవీణ్ అద్భుతంగా కట్ చేశారు. ఒక కాన్సెప్ట్ తో వున్న కంటెంట్ ఇది. సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాం. సాంకేతిక నిపుణులు, నటీనటుల పనితనం గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. అనంతపురం ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి గారు మా సినిమాకి బెస్ట్ విషెస్ అందించడం చాలా ఆనందంగా వుంది. చిరంజీవి గారికి కృతజ్ఞతలు. విడుదలౌతున్న అన్ని సినిమాలు అద్భుతంగా ఆడాలి” అని కోరారు.
భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.