అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 ది సెకండ్ కేస్. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమాపై శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. మీనాక్షి చౌదరి హీరోయిన్. డిసెంబర్ 2న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ, ‘‘ఇన్ని రోజులు ఇంగ్లీష్లో మాట్లాడి మాట్లాడి చిరాకేసింది. ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే చాలా హాయిగా ఉంది. హిట్ అనేది సినిమాలా కాకుండా ఫ్రాంచైజీగా తయారు చేసిన నాని, ప్రశాంతి, శైలేష్లకు కంగ్రాట్స్. అదంత ఈజీ కాదు. హిట్ సినిమా చేయొచ్చు కానీ.. ఫ్రాంచైజీ చాలా కష్టం. సాధారణంగా హీరోకో, దర్శకుడికో ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఓ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండటం అనేది ఇండియాలోనే ఫస్ట్ టైమ్ అని అనుకుంటున్నాను. అలాంటి గొప్ప ఫ్రాంచైజీ చేసినందుకు టీమ్కు అభినందనలు. హిట్ 1లో చేసిన విశ్వక్ సేన్ … హిట్ 2లో చేసిన అడివి శేష్ ఓ ఎనర్జీని తీసుకొచ్చారు. హిట్ 2 ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చూస్తుంటేనే సినిమాలోని హత్యలనుచేసే హంతకుడెవరు.. వెంటనే సినిమా చూడాలనిపించింది. అలాంటి ఎగ్జయిట్మెంట్ కలిగించటమే థ్రిల్లర్ జోనర్ మూవీ స్టైల్. శైలేష్ అందులో కంప్లీట్గా సక్సెస్ అయ్యాడు. హిట్ 2 చాలా పెద్ద హిట్ అవుతుంది. అందులో డౌటే అక్కర్లేదు. హిట్ 3, హిట్ 4, హిట్ 5 వరుసగా వస్తాయి. అందులో డౌట్ లేదు. అయితే ప్రతి సినిమా ఒకే టైమ్ కి రావాలి. అది హిట్ సీజన్ కావాలి. అది జనాలకు అర్థం కావాలి. సేమ్ డేట్, సేమ్ వీక్ రావాలి. అందరూ చాలా బాగా చేశారు. టెక్నీకల్ వేల్యూస్ బావున్నాయి. తెలుగు సినిమా నుంచి వస్తున్న మరో క్వాలిటీ సినిమా ఇది. డిసెంబర్ 2న హిట్ 2 ది సెకండ్ కేస్ తో థియేటర్స్లో కలుద్దాం’’ అన్నారు.