ఆది సాయికుమార్ కథానాయకుడిగా, శ్రీ సత్యసాయి ఆర్ట్స్లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కె కె రాధామోహన్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరో శర్వానంద్ ప్రీరిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ, “ఆది నాకు బ్రదర్ లాంటివాడు. తనని తమ్ముడిలానే చూస్తాను. తనకి సక్సెస్ వస్తే నేను ఎంజాయ్ చేస్తాను. క్రేజీ ఫెలోలో రన్ రాజా రన్ ఫ్లేవర్ కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే మంచి ఎంటర్టైనర్ అనిపిస్తోంది. క్రేజీ ఫెలో పెద్ద సక్సెస్ కావాలి. రాధ మోహన్ గారు నాకు పదేళ్ళుగా పరిచయం. పాటలు చాలా బావున్నాయి. దర్శకుడు ఫణి కృష్ణ టేకింగ్ బావుంది. మాటల్లో మంచి కామెడీ టైమింగ్ వుంది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ బెస్ట్ విషెస్. అక్టోబర్ 14న సినిమా వస్తోంది. అందరూ థియేటర్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి,” అన్నారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ, “ఈ ఈవెంట్ కి వచ్చిన శర్వానంద్ అన్నకి కృతజ్ఞతలు. మారుతి, సంపత్ నంది గారికి థాంక్స్. క్రేజీ ఫెలో హిలేరియస్ ఎంటర్టైనర్. మంచి ఎమోషన్ కూడా వుంటుంది. కథని బలంగా నమ్మి చేశాం. దర్శకుడు ఫణి కృష్ణ చాలా అద్భుతమైన కథని రెడీ చేశారు. నిర్మాత రాధామోహన్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. ద్రువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సతీష్ ముత్యాల గారు వండర్ఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఈ సినిమాలో చేసిన మిర్నా, అనీష్, రమేష్, సప్తగిరి. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. అక్టోబర్ 14న సినిమా థియేటర్లోకి వస్తుంది. ప్రేక్షకులు థియేటర్ లో చూసి ఆదరించాలి,” అని కోరారు.