హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్లో ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో వస్తున్న ఎంటర్టైనర్ క్రేజీ ఫెలో. దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ కథానాయికలు. అక్టోబర్ 14న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో హీరో ఆది సాయికుమార్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
క్రేజీ ఫెలో ఎలా వుండబోతుంది?
చాలా మంచి ఎంటర్టైనర్. సినిమాపట్ల అందరం చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాం. దర్శకుడు ఫణి చాలా మంచి కథ రాసుకున్నాడు. చాలా నీట్ గా ప్రజంట్ చేశాడు. కామెడీ ఆర్గానిక్ గా వుంటుంది. అందరికీ నచ్చే కథ ఇది. కె.కె.రాధామోహన్ గారికి కూడా చాలా బాగా నచ్చి సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. క్రేజీ ఫెలోలో మంచి మ్యాజిక్ వుంది.
మీ పాత్ర ఎలా వుండబోతుంది?
ఇందులో నా పాత్ర చాలా క్రేజీగా వుంటుంది. తొందరపాటు క్యారెక్టర్. చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొనితెచ్చుకునే క్యారెక్టర్. నర్రా శ్రీనివాస్, అనీస్ కురువిల్లా పాత్రలతో పాటు మిగతా పాత్రలు కూడా బావుంటాయి. ప్రతి క్యారెక్టర్ లో ఫ్రెష్ నెస్ వుంటుంది.
మీ కెరీర్ విషయంలో నాన్నగారి జోక్యం ఎలా వుంటుంది?
కొన్ని కథలు నాన్న వింటారు. కొన్ని నేను విని తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటాను. ముందు చక్కగా వినమని చెబుతారు. ఆయన జడ్జిమెంట్ బావుటుంది. ఇకపై చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటూ చేయాలి.
కామెడీ చేయడంలో సవాల్ వుంటుందా?
ఈ సినిమా కామెడీ విషయంలో దర్శకుడు చాలా పర్టిక్యులర్. టైమింగ్ విషయంలో చాలా ఖచ్చితంగా వుంటారు. కామెడీ చాలా సహజంగా చేశాం. కామెడీ సీన్స్ అన్నీ హిలేరియస్ గా వుంటాయి.
ప్రేక్షకులకు క్రేజీ ఫెలో ఎలాంటి ఇంపాక్ట్ ని ఇస్తుంది?
మంచి ఎంటర్టైనర్ చుశామనే ఫీలింగ్ ఇస్తుంది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. సినిమా చుసిన ప్రేక్షకులు బావుందని పదికి చెప్పుకునేలా వుంటుంది. ఇందులో మంచి ఎమోషన్ కూడా వుంది.
కొత్తగా చేయబోతున్న సినిమాలు?
టాప్ గేర్ అనే థ్రిల్లర్, మరో క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్నా. ఇంకొన్ని కథలు చర్చల్లో వున్నాయి. అలాగే పులి మేక అనే వెబ్ సిరిస్ కూడా చేస్తున్నా.