సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన డీజే టిల్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సిద్ధుతో డీజే టిల్లు సీక్వెల్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే సీక్వెల్ ని రూపొందిస్తూ మాట నిలబెట్టుకున్నారు నాగవంశీ. డీజే టిల్లు సీక్వెల్ కి టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, దీపావళి సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. సీక్వెల్ లో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. టిల్లు స్క్వేర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. 2023 మార్చిలో సీక్వెల్ థియేటర్లలో సందడి చేయనుంది.
Click to watch Tillu Square teaser